దక్షిణాది సినిమా పరిశ్రమలో నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. అదేవిధంగా గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోందని తెలుస్తుంది. ఈ విధంగా పలు భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత గురించి జెర్సీ సినిమా ఫేమ్ నటి శ్రద్ధ శ్రీనాథ్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారని తెలుస్తుంది. ఈమె చేసిన కామెంట్ లపై సమంత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అసలు సమంత అభిమానులు నటి శ్రద్ధా శ్రీనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాట్లాడితే..

శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలుస్తుంది.ఈమె కన్నడ భాషలో తెరకెక్కిన “యూ టర్న్” చిత్రంలో రచన పాత్రలో నటించారని సమాచారం. ఈ సినిమాలో నటించినందుకుగానూ అప్పట్లో నటనపై చాలామంది ప్రశంసలు కురిపించారని సమాచారం. ఈ క్రమంలోనే యూ టర్న్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించగా ఇందులో రచన పాత్రలో సమంత నటించారని తెలుస్తుంది.తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఇకపోతే ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నటి శ్రద్ధాశ్రీనాథ్ యూటర్న్ చిత్రం గురించి మాట్లాడుతూ సమంత పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని సమాచారం.


 
ఈ సందర్భంగా నటి మాట్లాడుతూ తాను చాలా పొసెసివ్ అని తెలిపిందట.రచన పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేనని జవాబు ఇచ్చిందట.  తెలుగులో యూ టర్న్ చిత్రాన్ని కేవలం అరగంట కూడా చూడలేకపోయానని చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా మొత్తం ఒకసారి చూడటానికి ప్రయత్నిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిందని సమాచారం.ఈమె వ్యాఖ్యలపై సమంత అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. నటనలో శ్రద్ధా శ్రీనాథ్ కన్నా సమంత ఎంతో సీనియర్ అయినప్పటికీ ఒక సీనియర్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడటం మంచిది కాదని తెలుస్తుంది.తనకన్నా సీనియర్స్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని సమంత అభిమానులు ఈమె పై అప్పట్లో విమర్శలు కురిపించారని సమాచారం.ఈ విధంగా తెలుగులోకి అడుగు పెట్టడంతోనే ఇలాంటి వివాదాలు సృష్టించిన ఈమె తెలుగు సినిమా పరిశ్రమలో ఏవిధమైనటువంటి అవకాశాలు లేక బాలీవుడ్ పరిశ్రమ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: