టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్క సారిగా తన కెరియర్ ను మార్చుకున్న రామ్ ఆ తర్వాత కూడా అదే విధంగా సినిమాలను తెరకెక్కిస్తు ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

భారీ అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమాతో మరొకసారి భారీ హిట్ కొడతాననే నమ్మకం రామ్ చూపిస్తుండగా ఆయన అభిమానులు కూడా అదే విధమైన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్ తన తదుపరి సినిమాను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధం చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. కమర్షియల్ చిత్రాలకు కామెడీని మేళవించి సక్సెస్ను సాధిస్తుంది అనిల్ రావిపూడి ఇటీవలే రామ్ కోసం మరొక కమర్షియల్ కథను సిద్ధం చేయగా దాన్ని ఓకే చేసుకున్నాడు.

 ప్రస్తుతం చేస్తున్న f3 సినిమా పూర్తి చేసిన తర్వాత దీనిపై కసరత్తులు చేయనున్నాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు అనిల్ రావిపూడి ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమా చేయనున్నడనే వార్తలు వస్తుండగా రామ్ సినిమా బాలకృష్ణ సినిమా తర్వాత చేస్తాడా లేదా దానికి ముందు చేస్తాడా అనేది చూడాలి. రామ్సినిమా పూర్తయిన వెంటనే మరొక సినిమా చేయాలి. మరి ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి అందుబాటులో లేకపోతే ఎవరితో ముందుకు వెళతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: