సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు. ఆయన నటుడిగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలపై ఎంతో శ్రద్ధ వహిస్తూ సూపర్ హిట్ సినిమాలను చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాడు. అయితే కొన్ని ప్రయత్నాలు విఫలం అవగా వాటి నుంచి ఒక మంచి పాఠం నేర్చుకుని దాన్ని తిరిగి రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తు ఉండగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చెప్పాలంటే సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది అని చెప్పవచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తు ఉండగా ఈ చిత్రంతో మరో హిట్ సాధించడానికి మహేష్ రెడీగా ఉన్నాడు. 


ఇదిలా ఉంటే మహేష్ బాబు రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు అని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఇతర హీరోలు దేశం మొత్తం అలరిస్తూ ఉండగా మహేష్ మాత్రం చిన్న దర్శకులతో లోకల్ సినిమాలన్ నమ్ముకున్నాడు. పాన్ ఇండియా సినిమా ల సంగతి పక్కన పెడితే కనీసం పెద్ద దర్శకులతో అయినా ఆయన సినిమా చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాము అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా అనిల్ రావిపూడి తో, సర్కార్ వారి పాట సినిమా ను పరశురామ్ లాంటి మీడియం రేంజ్ దర్శకులతో చేయడమే ఈ రకమైన డౌట్ కు కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: