ప్రస్తుతం
ఎన్టీఆర్ రాజమౌళి తో చేస్తున్న
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే
కొరటాల శివ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. త్వరలోనే
రాజమౌళి సినిమాను పూర్తి చేసి
ఎన్టీఆర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా
కొరటాల శివ తో చేతులు కలపాలని భావిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతాగ్యారేజ్ అనే
సినిమా రాగా ఇప్పుడు ఈ
సినిమా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారట. పొలిటికల్ నేపథ్యంలో
ఎన్టీఆర్ కు తగ్గ రేంజ్ లో భారీ పవర్ ప్యాక్డ్ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుందని అంటున్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో
రాజమౌళి కొరటాల శివ సినిమా మొదలు పెట్టిన కొన్ని రోజులకే
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమాను కూడా మొదలు పెట్టాలని చూస్తున్నాడు ప్రశాంత్. ఆయన చేస్తున్న సలార్
సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో తొందరలోనే ఈయన
ఎన్టీఆర్ సినిమాకు పని చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ
సినిమా కోసం
ప్రశాంత్ ఇప్పటివరకు ఏ హీరోతో చేయని భారీ సాహసాన్ని చేయబోతున్నాడని తెలుస్తోంది. అది
ఎన్టీఆర్ కోసం మాత్రమే చేస్తున్నాడు.
ఇంతకీ ఆ భారీ సాహసం ఏమిటంటే
ఎన్టీఆర్ కోసం యాక్షన్ సీన్స్ ను భారీ రేంజ్ లో చేస్తున్నాడట. సినిమాలోని సగం కంటే ఎక్కువ బడ్జెట్ దానికోసమే ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంతవరకూ యాక్షన్ సీన్స్ కోసమే ఇంత భారీగా ఖర్చు పెట్టడం ఏ సినిమాకి జరగలేదు. తొలిసారిగా వీరిద్దరి సినిమాకు జరుగుతుంది. ఆ మధ్య
ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఈ
సినిమా అధికారిక ప్రకటన జరగగా
ఎన్టీఆర్ అభిమానులు ఈ కాంబినేషన్ తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఎలాంటి
సినిమా ను తెరపైన చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారో చూడాలి.