మహేష్ బాబు హీరోగా పరశురామ్ తీస్తున్న సర్కారు వారి పాట ఎంతో భారీ రేంజ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్ తో ఫస్ట్ టైం పరశురామ్ తీస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది.

మహేష్ ని ఇంతవరకు ఎవరూ చూపించని ఒక డిఫరెంట్ రోల్ లో పరశురామ్ ఈ సినిమాలో ఆయన పాత్ర ని రాసుకుని ప్రెజెంట్ చేస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో అలవైకుంఠపురములో విలన్ సముద్రఖని నెగటివ్ రోల్ లో నటిస్తుండగా జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం త్వరలో యూనిట్ యూరోప్ వెళ్లనుండగా అక్కడ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు రెండు సాంగ్స్ ని కూడా చిత్రీకరించనున్నారట. బ్యాంకుల్లో జరిగిన పలు ఆర్ధిక నేరాల నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ని మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీస్తున్నారట పరశురామ్. ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ షూటింగ్ నేడు హైదరాబాద్ లో జరుగుతుండగా ఆ షూటింగ్ స్పాట్ లో మహేష్ బుల్లెట్ బైక్ పై కూర్చున్న సీన్ తీస్తుండగా అక్కడి కొందరు స్థానికులు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ ఫోటో ఎంతో వైరల్ అవుతోంది. నిజానికి ఇటీవల ఈ మూవీ నుండి ఒక డైలాగ్ తో పాటు మరికొన్ని ఫైట్ మేకింగ్ సీన్స్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ఇకపై ఇటువంటి లీక్స్ బయటకు రాకుండా యూనిట్ మరింతగా జాగ్రత్త పడనుందట. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: