టాలీవుడ్ యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అలవైకుంఠపురములో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ కొట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్ ఈ మూవీలో బంటు రోల్ లో కనబరిచిన యాక్టింగ్ కి మంచి పేరు దక్కింది.

ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ అయితే ఏకంగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అవడంతో పాటు అటు యూట్యూబ్ లో కూడా దుమ్ము రేపాయి. ఆ విధముగా ఈ మూవీ తో తన కెరీర్ లోనే అతి పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం రష్మిక మందన్న తో కలిసి పుష్ప మూవీ చేస్తున్నారు. లెక్కల మాస్టర్ సుకుమార్ తీస్తున్న ఈ సినిమాని నవీన్, రవిశంకర్ మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మిస్తుండగా దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక సాంగ్ ఎంతో పాపులర్ అయింది.

అయితే ఈ సినిమా ద్వారా తొలిసారిగా అల్లు అర్జున్ సరసన జోడీ కడుతున్న యువ భామ రష్మిక మందన్న నిన్న తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకాభిమానులుతో కొద్దిసేపు ముచ్చటించి వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే అందులో భాగంగా మా స్టైలిష్ స్టార్ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటూ ఒక అల్లు అర్జున్ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రష్మిక బదుసలిస్తూ, అటువంటి గ్రేట్ యాక్టర్ గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు, తనతో మూవీ చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అంటూ రష్మిక చెప్పారు. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనిని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: