టాలీవుడ్ లో ఒక్కో సినిమాతో హీరోగా భారీ క్రేజ్ అందుకుంటూ కొనసాగుతున్న యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప. మొత్తం రెండు పార్ట్శ్ గా రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రఖ్యాత సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నట్లు టాక్. అల్లు అర్జున్ ఒక లారీ క్లీనర్ గా కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక కూడా పక్కాగా మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.

మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ తో పాటు కన్నడ యాక్టర్ ధనుంజయ విలన్స్ గా యాక్ట్ చేస్తుండగా బుల్లితెర సంచలన యాంకర్ అనసూయ భరద్వాజ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీపై అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉండగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్ ఎంతో ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచాయి. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో మొత్తం ఐదు వరకు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, కాగా వీటిలో రెండు భారీ ఛేజింగ్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా రూపొందగా ఇవి ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని ఇన్నర్ వర్గాల సమాచారం.

ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం అహోరాత్రులు హీరో అల్లు అర్జున్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదని, అలానే యూనిట్ కూడా ఎంతో కష్టపడుతున్న పుష్ప మూవీస్ రెండూ కూడా సూపర్ హిట్స్ కొట్టడం ఖాయం అని యూనిట్ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: