ప్రస్తుతం కెరీర్ పరంగా తొలిసారిగా కలిసి యాక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీరిద్దరితో కలిసి బాహుబలి డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే దీని తరువాత ఇప్పటికే అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ నెక్స్ట్ సినిమాలని లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

దర్శక దిగ్గజం శంకర్ తో రామ్ చరణ్ చేయనున్న నెక్స్ట్ మూవీ ఇటీవల అధికారికంగా మొదలైంది. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాని దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేయనున్నారు. భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో జరిగే కథగా సాగనున్నట్లు టాక్. మరోవైపు తన నెక్స్ట్ సినిమాని ఇటీవల కొరటాల శివ తో కన్ఫర్మ్ చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతము ఆ సినిమాలోని తన పాత్ర కోసం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నారని అంటున్నారు. అలానే రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా ఎంపికైందని కూడా వార్తలు వస్తున్నాయి. నేటి రాజకీయాల నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుండగా ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ యూనియన్ లీడర్ స్థాయి నుండి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదుగుతారని టాక్.

త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే అసలు విషయం ఏమిటంటే అటు చరణ్, శంకర్ సినిమా, అలానే ఇటు ఎన్టీఆర్, కొరటాల సినిమాలు రెండూ కూడా పక్కాగా వచ్చే ఏడాది వినాయక చవితి సమయానికి రిలీజ్ కి సంసిద్ధం అవుతున్నాయట. నిజానికి ఇవి రెండూ కూడా సమ్మర్ కి రావాలని చూసిన్నప్పటికీ ఆ సమయానికి మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతుండడంతో వినాయక చవితికి వీటిని ఆయా దర్శకనిర్మాతలు ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. మరి ఈ వార్త కనుక నిజం అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ద్వారా కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్టీఆర్, చరణ్ త్వరలో విడివిడిగా బాక్సాఫీస్ దగ్గర తలపడడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: