టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ,పాటలు జనాలను ఎంతగానో మెప్పించాయి. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఈ విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ లో భాగంగా వివిధ టీవీ ఛానళ్ళ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

 'లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. నాగ చైతన్య ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ పరుశురామ్ నాకు ఒక కథను వినిపించాడు , ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చేద్దాం అని డిసైడ్ అయ్యాం. అయితే అంతకు ముందే పరుశురామ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక  కథ వినిపించాడు, కాకపోతే మహేష్ బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, దానితో మహేష్ బాబుతో సినిమా కష్టమే అని పరుశురాం అనుకున్నాడు. అయితే కొంత కాలానికి  పరశురామ్, మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యాను అని చెప్పాడు. దానితో నేను కూడా ఆ సినిమాను పక్కన పెట్టేశాను అని నాగ చైతన్య తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: