ఇది అటు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మరికొన్ని రోజుల్లో రానా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో భీమ్ నాయక్ సినిమా లో ఇద్దరు హీరోల సరసన నటించ పోయే అందమైన భామలు ఎవరు అన్నదానిపై కూడా ఆసక్తికర ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ సరసన నిత్యమీనన్ నటించబోతుంది అనేది తెలిసిందే. మరి భీమ్లా నాయక్ సినిమాలో మరో హీరో రానా సరసన ఎవరు నటించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటి వరకు రానా కి జోడి గా నటించే హీరోయిన్ ఎవరు అన్నది ఫిక్స్ చేయలేదట చిత్ర బృందం. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ ను రానా సరసన నటించే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది . ఇక త్వరలో చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా భీమ్లా నాయక్ సినిమా ని నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.