ప్రస్తుతం పవన్ కళ్యాణ్... రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా కూడా అది క్షణాలు అభివృద్ధిలో వైరల్ గా మారిపోతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో మాస్ రోల్ చేస్తూ ఉండడంతో పవన్ అభిమానులు అందరూ ఇక ఈ సినిమా అప్ డేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.


 ఇది అటు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మరికొన్ని రోజుల్లో రానా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  అదే సమయంలో భీమ్ నాయక్ సినిమా లో ఇద్దరు హీరోల సరసన నటించ పోయే అందమైన భామలు ఎవరు అన్నదానిపై కూడా ఆసక్తికర ప్రచారం ఊపందుకుంటుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ సరసన నిత్యమీనన్ నటించబోతుంది అనేది తెలిసిందే. మరి భీమ్లా నాయక్ సినిమాలో మరో హీరో రానా సరసన ఎవరు నటించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.



 ఇప్పటి వరకు రానా కి జోడి గా నటించే హీరోయిన్ ఎవరు అన్నది ఫిక్స్ చేయలేదట చిత్ర బృందం. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ ను రానా సరసన నటించే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది . ఇక త్వరలో చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా భీమ్లా నాయక్ సినిమా ని నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: