మెగాస్టార్
చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య
సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ
సినిమా వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈలోపు
చిరంజీవి తన తదుపరి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.
దసరా కానుకగా ఈ
సినిమా వస్తుందని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా పలు కారణాల వల్ల ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేశారు. మధ్యలో ఎక్కడ గాప్ లేకపోవడంతో ఆచార్య
సినిమా వేసవికి విడుదల చేయాలని భావించారు.
ఇదిలా ఉంటే ఈ
సినిమా తర్వాత మూడు సినిమాలను సెట్స్ మీదకు వెళ్లే విధంగా
చిరంజీవి ప్రణాళికలు రచించాడు. మొదటగా
మోహన్ రాజా దర్శకత్వంలో రాబోయే
గాడ్ ఫాదర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు మెగాస్టార్. ఆ తర్వాత
మెహర్ రమేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు చిరు. ఒకేసారి ఈ చిత్రాలను పూర్తి చేసే విధంగా ఆయన ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
ఇకపోతే
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో స్పెషల్ చిత్రంగా తెరకెక్కుతోంది
బాబీ దర్శకత్వంలోనీ
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు నిర్మించే వాల్తేరు వీరన్న సినిమా. ఈ సినిమాలో
మెగాస్టార్ ద్విపాత్రాభినయం లో నటిస్తున్నాడని వార్తలు రాగా
బాబీ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లో ఈ చిత్ర కథను తయారు చేశాడట. పవర్
జై లవకుశ వంటి చిత్రాలతో
మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించగా బాబి ఈ చిత్రాన్ని కూడా
మాస్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ
సినిమా ఓ సమస్యలో చిక్కుకుంది అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. ఈ
సినిమా కథలో కొన్ని అంశాలు చిరంజీవికి నచ్చడం లేదని వాటిని మార్చాలని బాబీకి సూచించాడని అని తెలుస్తుంది. మరి అవి
మార్చి బాస్ ను
బాబీ మెప్పిస్తాడో చూడాలి.