మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోందని తెలుస్తోంది. అదేంటంటే..ఇందులో తారక్ మరియు ఒలివియా (Olivia Morris) మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో జక్కన్న సంతృప్తికరంగా లేదని సమాచారం.
బ్రిటీష్ యువతి మరియు గిరిజన యువకుడు కొమ్రంభీమ్ మధ్య వచ్చే లవ్ స్టోరీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో తారక్ మరియు ఒలివియా మధ్య వచ్చే సీన్లను అందంగా తీర్చిదిద్దేందుకు మరోసారి షూట్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడని సమాచారం. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ లోనే దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించిన తారక్ మరియు ఒలివియా లవ్ ట్రాక్ ఎపిసోడ్ ను రీషూట్ చేయాలనే ప్లాన్ వల్లే విడుదలలో జాప్యం అవుతుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తుందని సమాచారం.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు మరియు కొమ్రంభీం పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయని తెలుస్తుంది.తారక్ మరియు ఒలివియా ఎపిసోడ్ ను మళ్లీ షూట్ చేసిన తర్వాతే విడుదల తేదీపై స్పష్టత ఇస్తాడా లేదా అన్నది చూడాలి మరి