తెలుగు చిత్ర పరిశ్రమకి అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జోయిన్ అయ్యింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి తన నటన, అందచందాలతో కుర్రకారుల మనస్సును దోచేసుకుంది. ఆమె పలు సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకుంది ఈ భామ. అంతేకాదు.. ఫ్యాషన్ రంగంలో మిస్ ఉత్తరాఖండ్ గా కూడా నిలిచింది లావణ్య త్రిపాఠి. అయితే చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇదిలా ఉంటే ఓ విషయంలో డిమాండ్ చేసిన ఈ బ్యూటీ మంచి బ్లాక్ బస్టర్ సినిమా నుండి అవకాశాన్ని కోల్పోయిందని సమాచారం. అయితే అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనా లావణ్య ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలను అందుకుంది. ఆమె దూసుకెళ్తా, సోగ్గాడే చిన్ని నాయన, భలే భలే మగాడివోయ్ వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు.. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే లావణ్యకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలో అవకాశం వచ్చిందట. ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ తో తెరకెక్కిన గీతా గోవిందం. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటీనటులుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై  తెరకెక్కించారు. ఇక ఇందులో ముందు లావణ్యకు అవకాశం అందుకుంది. కాగా.. ఈ సినిమాలో భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో తనను ఈ సినిమా నుండి తీసేసారని సమాచారం. దాంతో రష్మిక ఈ సినిమాలో తాను నటిస్తున్నానని సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడంతో లావణ్య కూడా నటించడం లేదని క్లారిటీ ఇచ్చారంట.


మరింత సమాచారం తెలుసుకోండి: