దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన 'బహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్ గా ఒక గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా తర్వాత రాజమౌళిహీరో తో సినిమా చేస్తాడో అనే ప్రశ్న చాలా మందిలో కలిగింది. అయితే రాజమౌళి  'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ సినిమా కంటే ముందు రాజమౌళి మరో సినిమాకు దర్శకత్వం వహించాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి ఎంతలేదన్నా ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరియు ఈ సినిమాల తర్వాత రాజమౌళి సినిమా కోసం కొత్త లుక్ లోకి మహేష్ బాబు మారడం కోసం కొంత సమయం పడుతుంది. అంటే కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో రాజమౌళి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నెల నెలన్నర లో సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత చకచక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంత తక్కువ సమయంలో రాజమౌళి సినిమాను పూర్తి చేయగలడా.. అని కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: