హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్నారు హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇక బాహుబలి సినిమా అనంతరం.. ప్రభాస్ క్రేజ్ ఎవరు అందుకొని ఎత్తుకు వెళ్ళింది.  ఇక బాహుబలి అనంతరం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాదే శ్యాం, సాలార్ మరియు ఆది పురుష్ ఇలా వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్. 

ఇందులో రాధేశ్యాం ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా ఆది పురుషుడు మరియు సాలర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఆది పురుష్ సినిమా కోసం... భారీ సహసం చేస్తున్నాడట రెబల్ స్టా ర్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమా క్స్ దశ లో ఉంది. అయితే అక్టోబర్ 9 వ తేదీ వరకు  ఇరవై ఆరు రోజులు సాగే...  ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ క్లైమాక్స్  సీన్స్ తీయ నున్నారట. అంతే కాదు ఈ క్లైమాక్స్ సీన్ లను డూప్ లేకుండా నే ప్రభాస్ చేయనున్నారని సమాచారం. దీని కోసం ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలెట్టేశాడు రెబల్ స్టార్  ప్రభాస్.

కాగా ఆది పురుష్ టింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి విధితమే. ఇక ఈ సినిమాకు ఓం రౌత్ డైరెక్షన్ చేస్తుండగా ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగ్ కీలక పాత్రలు చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా... మన తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటోందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: