వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 25వ సినిమా చేయబోతున్నాడు. ఇన్ని రోజుల వరకు ఈ సినిమాకు నిర్మాత ఎవరు.? దర్శకుడు ఎవరు.? అని అనేక ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. కాకపోతే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో మంచి  నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజు, ప్రభాస్ 25వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం అందుతుంది.

ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. మరి ప్రభాస్ 25వ సినిమాకు దర్శకుడు ఎవరు. ? ఇంకెవరు ఇప్పటికే ప్రభాస్ తో 'సలార్' వంటి ప్రతిష్ఠాత్మకమైన పాన్ ఇండియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్. ఇప్పటికే 'కెజిఎఫ్' చాప్టర్ వన్ తో ఇండియా వైడ్ గా గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్  'కేజిఎఫ్' చాప్టర్ టు ను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరియు ఇప్పటికే ఫుల్ క్రేజ్ లో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సలార్' సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియా డైరెక్టర్ అది కూడా ఇటు మ‌న ద‌క్షిణాది, అటు ఉత్త‌రాది సినీ ప్రేక్ష‌కుల ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు అయి ఉంటే బావుంటుంద‌ని భావించిన నిర్మాత దిల్ రాజు , ప్రశాంత్ నీల్ ను, ప్రభాస్ 25వ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 23 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ 20వ సినిమా గా 'రాధే శ్యామ్' సినిమాను చేయగా, ఆది పురుష్,  సలార్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు. వీటితో పాటు  ప్రభాస్ 24వ సినిమా పై కూడా త్వరలోనే ఒక క్లారిటీ రనుందట. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ప్రభాస్ రెండు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: