టాలీవుడ్ అప్ కమింగ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్.ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం ఎంతో పరితపిస్తున్నాడు. ఇక ఇటీవల సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినప్పటికీ.. ఆ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక తాజాగా ఈ హీరో నటించిన 'గల్లీ రౌడీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.రాజేంద్రప్రసాద్, బాబీ సింహా లాంటి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
 
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన సందీప్ కిషన్..పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.తాను ఎప్పుడైన ఒత్తిడికి లోనైనప్పుడు దాని నుండి బయటపడటానికి థమన్ కంపోజ్ చేసిన మాస్ పాటలను పెట్టుకొని కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్తానని చెప్పాడు.ఇక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి కథతో మళ్ళీ ఎప్పుడు సినిమా ఉంటుందని అడిగితే..మళ్ళీ ఆ సినిమా ఎందుకని.. కొత్త కథ చేద్దామని తెలిపాడు సందీప్.ఇక నాగార్జున గురించి ఒక్కమాటలో చెప్పమంటూ నెటిజన్ అడగగా..కొత్త దర్శకులతో,కొత్త జోనర్లతో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే మార్గదర్శకులు నాగార్జున గారని వెల్లడించారు.ఇక సినిమాలే కాకుండా దేశాలను చుట్టి రావడం తనకు ఎంతో ఆసక్తి అని..

ప్రపంచ చరిత్రకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూస్తుంటానని సందీప్ పేర్కొన్నారు.ఇక తనకు జార్జిరెడ్డి సినిమా బాగా నచ్చించని..అవకాశం వస్తే జార్జిరెడ్డి బయోపిక్ లో నటిస్తానని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.ఇక తన ఫ్రెండ్ అయిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి స్పందిస్తూ..తేజు మంచి మనసున్న వ్యక్తి అని..త్వరలోనే అతను ఆరోగ్య వంతంగా తిరిగి వస్తాడని తెలిపాడు.ఇక  వ్యక్తిగత జీవితంలో తన సోదరి మౌనిక ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని..గత కొన్నేళ్లలో తన సిస్టర్ తో బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యిందని సందీప్ వెల్లడించాడు.ఇక తతనకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందని..మూడేళ్ళ క్రితం సిగరెట్ అలవాటు అయ్యిందని.. అయితే ఆ అలవాటును త్వరలోనే మానేస్తానని నెటిజన్స్ తో చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: