టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు  తన సినిమాలను ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.కానీ మహేష్ తాజాగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ మాత్రం చాలా నిదానంగా జరుగుతుంది.గీతా గోవిందం ఫేమ్ పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.బ్యాంకింగ్ రంగంలో జరిగే కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇదిలా ఉంటె రెండున్నర నెలలు  కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా లేట్ అయింది అనే చెప్పొచ్చు.అయితే స్పెయిన్ లో ఈ సినిమా షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది.

షూటింగ్ సమస్యలు ఇలా ఉంటే మరోవైపు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసి హిట్ సాధించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మహేష్.కాగా డిసెంబర్ లో సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్, దానికి సంబంధించి డైలాగ్స్ చెప్పే విధానం మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందట.స్పెయిన్ లో ఈ సినిమా షూటింగ్ పనులు నెలరోజుల పాటు ఉంటుందని అక్కడ పాటల షూటింగ్ జరుగుతుందని సమాచారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్నారు. కాగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్...

 ఆ సినిమా కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఇదిలా వుండగా ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేయాలని చేసి రాజమౌళి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది సెకండాఫ్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని  సమాచారం. అయితే  మహేష్  ఈ సినిమా షూటింగ్ ఇలా లేట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: