కాగా గతంలో మలయాళంలో భారీ విజయం సాధించిన మూవీగా నిలిచిన 'దృశ్యం' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేసి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను రెడీ చేస్తు్న్నాడట మన విక్టరీ వెంకటేష్. ఇప్పటికే మలయాళంలో వచ్చిన 'దృశ్యం-2' చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్ను అందుకుందని సమచారం.దీంతో ఈ సినిమా రీమేక్లో వెంకటేష్ మరోసారి నటిస్తున్నాడని తెలుస్తుంది.
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపినట్లు సమాచారం. అయితే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ సెప్టెంబర్ 20న ఉదయం 10.08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలిపినట్లు సమాచారం. దృశ్యం చిత్రం తెలుగులోనూ మంచి క్రేజ్ను దక్కించుకుందని తెలుస్తుంది.ఇప్పుడు దృశ్యం-2 చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారని సమాచారం.
ఇక రాంబాబు పాత్రలో మరోసారి తన యాక్టింగ్తో అందరిని అలరించబోతున్నాదట వెంకటేష్.ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మీనా కూడా నటిస్తోందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా మలయాళ దర్శకుడు అయిన జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నాడని సమాచారం.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తుంది...