తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు లేక మకాం మారుస్తూ ఉంటారు.. అలాంటి వారిలో  భాగ్యశ్రీ కూడా ఒకరు.. ప్రేమ పావురాలు అనే సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి , ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటిగా గుర్తింపు పొందింది.. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది అంటే, ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసిన సినిమాగా గుర్తింపు పొందింది.. ఆ తరువాత భాగ్యశ్రీ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి , తన అందచందాలతో, ముఖ్యంగా వస్త్రధారణలో ఎలాంటి హద్దులు దాటకుండా నటించి ఎంతోమంది మనసు దోచుకున్న నటిగా గుర్తింపు పొందింది.నటసింహ బాలకృష్ణ నటించిన యువరత్న రాణా అనే సినిమాలో ఈయనకు చెల్లెలి పాత్రలో నటించి, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన ఓంకారం అనే సినిమాకి హీరోయిన్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆనాటి కాలంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులలో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతోంది.

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ చిత్రంలో హీరోకి తల్లి పాత్రలో నటిస్తోంది. 52 సంవత్సరాల వయసు కలిగిన భాగ్యశ్రీ, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో ప్రభాస్ కి  హీరోయిన్ అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. అన్నంతగా అంతే అందంగా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక ఆమె ఇటీవల షేర్ చేసిన ఫోటోలను చూస్తే అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు.ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు.. ఇక్కడ భాగ్యశ్రీ నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆమె ఐదు పదుల వయసులో కూడా ఇంత అందంగా ఉండడం వెనుక గల రహస్యం ఏమిటీ అంటూ మరికొంతమంది ఎంతో ఆసక్తికరంగా అడుగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: