సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు కొన్ని హద్దులను పెట్టుకొని ఉంటారు. ఇక వాటిని దాటి వెళ్లడానికి ఇష్టపడరు. అలాంటి వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరించింది అని చెప్పవచ్చు.. కానీ బాక్సాఫీసు వద్ద భారీగా బోల్తాపడింది..ఈ  రొమాంటిక్ చిత్రం ఇప్పుడు కనుక విడుదలై ఉంటే, ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధించి ఉండేది అంటూ.. రామ్ చరణ్ ఫ్యాన్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నిర్మాతగా నాగబాబు వ్యవహరించిన ఈ సినిమా.. ఆయనకు ఆస్తులు అమ్ముకునేంతగా నష్టాన్ని అందించింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న నాగబాబును  తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో భారీ డిజాస్టర్ ను చవిచూసింది అని, దీని రిజల్ట్ చూసి చరణ్ కూడా షాక్ అయ్యాడని సమాచారం..


దీంతో ఆయన మాస్ సినిమాలవైపు మక్కువ చూపారు.. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన అభిమానులు రామ్ చరణ్ మళ్లీ ప్యూర్ లవ్ స్టోరీ సినిమాలు తీస్తే బాగుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఇప్పటికే మాస్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్, ప్రస్తుతం తన ఇమేజ్ కు భిన్నంగా పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లో ప్యూర్ లవర్ బాయ్ గా మారిపోయిన విషయం తెలిసిందే.


ఇక ఈ సినిమా రిజల్ట్ గనుక మంచి విజయాన్ని అందుకుంటే, ఆ తర్వాత చరణ్ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి సినిమాలలో చేస్తాడేమో అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆరెంజ్  సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీ అంటేనే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకొని , తన 15వ చిత్రం షూటింగ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: