నందమూరి
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ చిత్రం నుంచి తొలి పాట ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడిగా అడిగా అంటూ
తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. మెలోడీయస్ గా ఈ పాటను రూపొందించగా ఎస్పీ చరణ్ మరియు
శృతి లు ఈ పాటను ఆలపించారు. కళ్యాణ
చక్రవర్తి సాహిత్యాన్ని సమకూర్చగా
తమన్ స్టైల్లో ఎంతో అద్భుతంగా ఈ పాటను స్వరపరిచారు అని కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు టీజర్లు విడుదలయ్యాయి.
తొలిసారిగా ఈ పాట విడుదల కావడంతో చిత్రం పై మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో
బాలకృష్ణ నటిస్తున్న మూడవ
సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన
సింహ లెజెండ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ అయి వీరి కాంబినేషన్ కు హ్యాట్రిక్ హిట్ ను సమకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా
శ్రీకాంత్ నటిస్తున్నాడు.
ఈ సినిమాని
మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకొంతమంది ఈ
సినిమా దసరా కానుకగా రావటం లేదు అని కూడా అంటున్నారు. ఏదైతేనేం ఈ చిత్ర విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా
బాలకృష్ణ ఫ్లాప్
సినిమా లు చేస్తుండగా ఈ
సినిమా హిట్ కావాలని భావిస్తున్నాడు. అంతేకాకుండా
బోయపాటి శ్రీను గత చిత్రం కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. ఆయన కూడా ఈ చిత్రం తనకు మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో వీరిద్దరి కు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అఖండ
సినిమా ఏ రేంజ్ లో వీరికి హిట్ అందిస్తోందో చూడాలి.