రెబల్ స్టార్
ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీ గా ఇప్పుడు ఉన్నాడు. ఆయన హీరోగా ఒకేసారి నాలుగు సినిమాలు తెరకెక్కుతు ఉండడం వల్ల వచ్చే ఏడాది మూడు సినిమాలు విడుదల అవుతుండటం చూస్తుంటే
ప్రభాస్ తన అభిమానులకు భారీ రేంజ్ లో సర్
ప్రైజ్ ఇవ్వబోతున్నాడు తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా రాధే
శ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన
ప్రభాస్ ఆ చిత్రం తర్వాత సలార్, ఆదిపురుష్ చిత్రాలు అదే సంవత్సరం విడుదల అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాడు.
రాధాకృష్ణ దర్శకత్వంలో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న రాధేశ్యామ్
సినిమా తో
ప్రభాస్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండడంతో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న
ఆది పురుష్ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే తెలుస్తుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇది కూడా కొన్ని రోజులలోనే పూర్తవనుందట. ఈ సినిమాకు ఈ క్లైమాక్స్ ఫైట్ హైలెట్ కాబట్టి దీన్ని ఎంతో జాగ్రత్తగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట.
మైథలాజికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా
ప్రభాస్ సీతగా కృతిసనన్ రావణుడిగా
సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల చేస్తున్నారు. 3d విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని
బాలీవుడ్ నిర్మాత
భూషణ్ కుమార్ కృష్ణ
కుమార్ ప్రసాద్ రాజేష్ నాయర్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్
ఇండియా చిత్రం గా రాబోతున్న ఈ సినిమాను
హిందీ తెలుగు
కన్నడ తమిళ మళయాళ భాషలలో నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ
సినిమా తరువాత
ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్
సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా దిల్ రాజు నిర్మాణంలో తన 25వ
సినిమా కూడా చేస్తున్నాడని సమాచారం.