అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి నాని నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈనెల 24వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల వాయిదా పడగా ఎట్టకేలకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఈ సినిమా నిర్మాతలైన నా నారాయణ దాసు కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.

ఏషియన్ సంస్థను ప్రారంభించి చాలా రోజులే అయ్యిందని ఆయన వెల్లడించారు. సినిమా ఫైనాన్స్ తో పాటు ఎగ్జిబిటర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఇన్ని రోజులు ఈ వ్యాపారం లో ఉన్నాను. మల్టీప్లెక్స్ వ్యాపారంలో కూడా ఇప్పుడు ఉన్నాను అని ఆయన వెల్లడించారు. 1987లో ఎగ్జిబిటర్ గా తన సినిమా కెరీర్ ను ప్రారంభించాను అని వెల్లడించారు. నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించి ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ఎల్పీ బ్యానర్ ను ఏర్పాటు చేసి తొలి సినిమా గా లవ్ స్టోరీ రూపొందించాం అన్నారు. 

అయితే ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నాం అన్నారు. అయితే ఏపీలో థియేటర్ల టికెట్ ధరలు బుకింగ్ విధానం ఇతర విషయాలపై ఆ ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవబోతున్నా అని ఆయన తెలిపారు. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది అని, కథలో కొత్తదనం ఉంటుందని, స్టోరీలైన్ కూడా ఎంతో ఆకట్టుకుంటుందని కరోనా కారణంగా మేము అనుకున్న రోజుల కంటే ఎక్కువ రోజులు షూట్ చేశామని ఆయన తెలిపాడు. ఇక పోతే సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా పై ఇవి భారీ అంచనాలను ఏర్పరిచేలా చేశాయి అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: