టాలీవుడ్
సినిమా పరిశ్రమలో క్రేజీ
హీరోయిన్ గా ఎదిగింది
కీర్తి సురేష్.
నేను శైలజ సినిమా తో తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని రెండవ చిత్రం నేను
లోకల్ తో కమర్షియల్ హిట్ ను సంపాదించి హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి
సినిమా సూపర్ హిట్ కావడంతో అతి తక్కువ కాలంలోనే
టాలీవుడ్ లో క్రేజీ
హీరోయిన్ గా మారింది.
మహానటి సినిమా విజయం తో వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించడం మొదలుపెట్టింది ఈమె.
అయితే అవి చేదు ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ కమర్షియల్ చిత్రాల్లో నటించే విధంగా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న
కీర్తి సురేష్ మరోవైపు సఖి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు తనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తాయని ఆమె భావిస్తుండగా మరిన్ని కమర్షియల్ సినిమాలకు సైతం ఆమె సైన్ చేయడం విశేషం.
తాజాగా ఆమె తనకు
సినిమా అవకాశం ఇచ్చిన
రామ్ రుణం తీసుకునే విధంగా ఆయన సినిమాలో ఓ కీలక పాత్రలో మెరుస్తుంది.
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ యాక్షన్
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో
కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ
సినిమా లో
కీర్తి సురేష్ కొన్ని నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో నటించనుందట. ఈ సినిమాలో ఈమె పాత్ర ఎంతో కీలకం కానుందని అంటున్నారు. మరి
కీర్తి హ్యాండ్ ఈ
సినిమా విజయానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. దర్శకుడు లింగుస్వామి తో కూడా
కీర్తి సురేష్ గతంలో ఓ సినిమాకు పని చేసింది. పందెంకోడి
సినిమా పందెంకోడి 2
సినిమా లో
హీరోయిన్ గా ఈమె నటించగా లింగు స్వామి దర్శకత్వం వహించాడు.