ఇటీవల కాలంలో మా అసోసియేషన్ లో ఎన్నికల రగడ ఏ రేంజ్ లో సెగలు రేపుతుందో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వంటివారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా వీరు ఒకరిపై ఒకరు సంచలనాత్మకంగా విమర్శలు చేసుకోవడం ఇప్పుడు తెలుగునాట సంచలనాన్ని సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ రెండు ప్యానెల్ ల మధ్య విమర్శలు జరుగుతూ ఉండగా మా అధ్యక్షుడు నరేష్ కూడా ఈ వివాదంలో ఇరుక్కోవడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ కూడా మా వివాదంలో పెద్ద పాత్ర పోషించగా దీని పైన వేసుకొ కీలక వ్యాఖ్యలు చేయడం దానికి కౌంటర్ గా మరికొంతమంది వ్యాఖ్యలు చేయడం కూడా తెలుగునాట ఎంతో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. తాజాగా అక్టోబర్ 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10వ తేదీన మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజు పోటాపోటీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించగా ఇటు విష్ణు కూడా తన ప్యానెల్ నుంచి ఒక కీలక పేరు బయటకు వచ్చింది.

ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానెల్ నుంచి రఘు బాబు పోటీలో ఉన్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఆయన జనరల్ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత పోటీ పడుతుండగా బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎన్నిక ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మా అసోసియేషన్ ఎన్నిక ఎప్పుడు విమర్శల మధ్యనే సాగుతోంది. గతంలో ఈ రేంజ్లో విమర్శలతో ఎప్పుడూ జరగలేదు కానీ ఆర్టిస్టుల మధ్య ఉన్న ఈగోల కారణంగా తీవ్రమైన విమర్శల మధ్య ఎంతో ఆసక్తికరంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మా అసోసియేషన్ భవనం ప్రధాన చర్చ గా ప్రతిసారి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: