స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తం మూడు సినిమాలు తీశారు. వాటిలో తొలిసారిగా వచ్చిన సినిమా జులాయి. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టింది. తనికెళ్ళ భరణి, రాజేంద్ర ప్రసాద్, ఎం ఎస్ నారాయణ, సోను సూద్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ఆ తరువాత మరొక్కసారి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా మరొక స్పెషల్ రోల్ లో నిత్యా మీనన్ కనిపించారు. అయితే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. దాని అనంతరం కొన్నేళ్ల గ్యాప్ తరువాత గత ఏడాది వీరిద్దరూ కలిసి చేసిన సినిమా అలవైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతో పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇందులోని సాంగ్స్ అయితే నేషనల్ రేంజ్ లో పాపులర్ అయి అల్లు అర్జున్ కి హీరోగా బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నారు. సుకుమార్ తీస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, నేడు అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ ఒక షూటింగ్ చేసారు. అయితే అది సినిమా కోసం మాత్రం కాదు సుమండీ. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ సంస్థ రాపిడో బైక్ యాప్ వారి తరపున ఒక యాడ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ఆ యాడ్ ని నేడు త్రివిక్రమ్ గారు చిత్రీకరించగా వారిద్దరూ కలిసి షూటింగ్ చేసిన ఆ యాడ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: