సూపర్ స్టార్ మహేష్ బాబు తో పరశురాం తీస్తున్న సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటెర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ మూవీలో అలవైకుంఠపురములో నటుడు సముద్రఖని విలన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ ని త్వరలో యూరోప్ లో నిర్వహించనున్నట్లు టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

బ్యాంకింగ్ రంగాన్ని ఇటీవల ఎంతో కుదిపేసిన పలు ఆర్ధిక నేరాలని ఆధారంగా చేసుకుని సాగే మంచి మెసేజ్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ పాత్ర అదిరిపోతుందని, తప్పకుండా వచ్చే ఏడాది జనవరికి విడుదల కానున్న ఈ మూవీ భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమా నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఈ ఈ నెలలో రిలీజ్ చేస్తారేమో అని మహేష్ ఫ్యాన్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఈ ఫస్ట్ సాంగ్ ని వచ్చే నెలలో దసరా సందర్భంగా విడుదల చేయనున్నారని ఇన్నర్ వర్గాల టాక్. కాగా ఈ మూవీ పై ప్రేక్షకాభిమానులు అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలున్న విషయం తెలిసిందే. మరి పరశురామ్ తో మహేష్ చేస్తున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ కొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: