టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కొన్ని రోజుల పాటు విరామం తీసుకుంది. అనంతరం కొత్త షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించబోతున్నారు. పోర్టు.. సముద్రం నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు ఈ చిత్రానికి అత్యంత కీలకమని తెలుస్తోంది. వైజాగ్ లో చిత్ర బృందం లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలకారున అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. చిత్ర బృందం వైజాగ్ లో అక్కినేని అఖిల్ మీద చిత్రీకరించే సీన్ లు ఈ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

 ఇప్పటికే సురేందర్ రెడ్డి తన సినిమాల లో హీరో లను చాలా స్టైలిష్ గా చూపిస్తాడు అనే పేరు ఉంది.  ప్రస్తుతం అక్కినేని అఖిల్ ను కూడా 'ఏజెంట్' సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  సైరా నరసింహ రెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు, మామూలు సినీ జనం కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అలాగే అఖిల్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని ఫుల్ కసి మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 8 వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: