మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ తో పాటూ కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్స్ ని పూర్తి చేశాడు.ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటె తాజగా రామ్ చరణ్ ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ కి కి బ్రాండ్ అంబాసిడర్ అయిన విషయం తెలిసిందే.'మన వినోద విశ్వం' అనే ట్యాగ్ లైన్ తో రామ్ చరణ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ను ప్రమోట్ చేస్తున్నారు.అయితే హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు గాను చరణ్ కి హాట్ స్టార్ సంస్థ భారీగానే ఇస్తుందట.తాజా సమాచారం ప్రకారం..

హాట్ స్టార్ సంస్థరామ్ చరణ్ కి సంవత్సరానికి 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట.దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే ఒక తెలుగు స్టార్ హీరోకి ఓ ఓటీటీ సంస్థ ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం బహుశా ఇదే మొదటి సారి.అయితే రామ్ చరణ్ ఓ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.ఏదేమైనా ఒక తెలుగు స్టార్ కి ఈ రేంజ్ లో చెల్లించడం అంటే విశేషమనే చెప్పాలి.ఇక రామ్ చరణ్ సినిమా విషయాలకొస్తే.. డైరెక్టర్ శంకర్ తో చేయబోయే సినిమాని ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.

 ఇక అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.సునీల్, శ్రీకాంత్, మలయాళ నటుడు జయరాం.. ఇలా అన్ని ఇండ్రస్టీ లకు సంబంధించిన ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక చరణ్ కెరీర్లో ఇది 15 వ సినిమా కావడం విశేషం.ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.గతంలో వీరిద్దరూ కలిసి బోయపాటి శ్రీను తెరకెక్కించిన :వినయ విధేయ రామ' సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: