దక్షిణాదిన పెద్ద చిత్రాల దర్శకుడిగా పేరున్న
శంకర్ ప్రస్తుతం
రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ నీ పెట్టని ఈ
సినిమా కు
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తు ఉండగా ఈ సినిమాలో కీయర అద్వానీ
హీరోయిన్ గా నటిస్తుండగా భారీ తారాగణం ఈ చిత్రంలో పని చేస్తుందని ఇటీవలే విడుదలైన
పోస్టర్ ను చూస్తే అర్థం అర్థం అవుతుంది. అయితే
శంకర్ కు అడిగినదల్ల ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తూ ఈ
సినిమా కోసం చాలా తగ్గేలా చేస్తున్నాడు
దిల్ రాజు.
గతంలో ఏ నిర్మాతకు ఇది సాధ్యపడకపోవడం ఇప్పుడు ఇలా చేసే
నిర్మాత దిల్ రాజు ఒక్కడే కావడం విశేషం. పాన్
ఇండియా మూవీ గా మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ
సినిమా ముహూర్తం
పోస్టర్ కోసమే
శంకర్ ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టించారనే వార్త తెలిసి ఇండస్ట్రీకు చెందిన వాళ్లు షాక్ అవుతుండగా ఇక్కడి నుంచి
శంకర్ ప్రతిదీ కూడా భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా వాటికి ఒప్పుకోవడం లేదట
దిల్ రాజు. గతంలో
శంకర్ చేసిన సినిమాలు భారీ గా ఉండేలా చేసి ఫెయిల్ కావడంతో ఇప్పుడు ఆ విధమైన రిస్క్ చేయాలని భావించడం లేదని
దిల్ రాజు భవిస్తున్నాడు.
ఈ
సినిమా విషయంలో
దిల్ రాజు చెప్పిన విధంగా ఖర్చు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
బాలీవుడ్ హీరోయిన్ కీయరా ఎంపిక విషయంలో ఇద్దరూ కాంప్రమైజ్ కాగా మ్యూజిక్
డైరెక్టర్ విషయంలో కొంత వాగ్వాదం జరిగిందట. నిజానికి
శంకర్ ఏ ఆర్ రెహమాన్ తోనే ఇప్పటివరకు
సినిమా చేస్తారా గా ఈ సినిమాకు
తమన్ ను ఎంపిక చేసుకున్నాడు. వీరిద్దరూ పారితోషకం లో ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దిల్ రాజు ఒత్తిడి వల్లే ఈ సినిమాకి
థమన్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి
సినిమా బడ్జెట్ విషయంలో
దిల్ రాజు ఎంతో ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. ఈ నేపథ్యంలో
శంకర్ కు కళ్లెం వేస్తూ ఈ
సినిమా బాగా వచ్చేలా చూసుకుంటున్నాడట
దిల్ రాజు.