ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది కీర్తీ సురేష్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ' సినిమాతో కీర్తీ సురేష్ టాలీవుడ్ ఇండ్రస్టీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మొదటి సినిమతోనే సక్సెస్ ని అందుకున్న ఈమె.ఆ తర్వాత నేను లోకల్, మహానటి సినిమాలు హిట్ అవ్వడంతో కీర్తీ సురేష్ కి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది.ఇక ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీగా వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా సర్కారు వారి పాట సినిమాతో పాటూ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమాలోమెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనుంది.

ఇక ఇదిలా ఉంటె దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత రామ్, కీర్తీ సురేష్ ల జోడీ వెండితెరపై కనిపించనున్నారని సమాచారం.ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇదే సినిమాలో కీర్తీ సురేష్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇక గతంలో మన్మథుడు2,జాతిరత్నాలు వంటి సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది కీర్తీ సురేష్.ఇక ఈ సినిమాలలో మన్మథుడు2 ప్లాప్ కాగా.. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇక ఇప్పుడు మళ్లీ రామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో మేరవబోతోంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు రామ్.ఇక మరోవైపు లింగుస్వామి గత సినిమా సండకోలి 2 అని తమిళ సినిమాలో  కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా..ఇక ఇప్పుడు రామ్ తో తాను తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయమని లింగుస్వామి కోరడంతో గెస్ట్ అప్పియరెన్స్ కి కీర్తీ సురేష్ వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్వరలోనే కీర్తీ పాత్రకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: