ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోగా ప్రస్తుతం చివరి షెడ్యూల్ ను గోవాలో చేస్తుంది చిత్రబృందం. ఇటీవలే షూటింగ్ కు సంబంధించిన ఓ పిక్ ను విడుదల చేయగా
విజయ్ దేవరకొండ అభిమానులు భారీగా ఈ లుక్కు ను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి సినిమాపై క్రేజ్ మరింత పెంచేలా చేసుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ
అనన్య పాండే ఈ చిత్రంలో
హీరోయిన్ గా నటిస్తూండగా
బాలీవుడ్ లో కూడా ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ
సినిమా గురించి గతంలో
విజయ్ దేవరకొండ కామెంట్ చేయడం అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఓ మెమ్ లో ఈ
సినిమా వందకోట్ల ఢీల్ అయిందని సోషల్
మీడియా లో రాగా దానికి
విజయ్ దేవరకొండ అంతకు మించిన కలెక్షన్లు
థియేటర్ లలో వసూలు చేయగలను అని నమ్మకాన్ని వ్యక్తపరచి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో తాజాగా
పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం చూపించాడు. ఈ చిత్రంతో తప్పకుండా మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు కూడా సాధించగలను అని చెప్పి పూరిజగన్నాథ్ తన కాన్ఫిడెన్స్ ను సినిమాపై చెప్పగలిగాడు.
కరణ్ జోహార్ తో కలిసి చార్మి
పూరి జగన్నాథ్ తో కలిసి ఈ చిత్రాన్ని
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలోనే పాటల్ని విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.