యాంకర్ గా టాలీవుడ్ కి ప్రవేశించి ఆ తర్వాత నటిగా మారిన అనసూయ భరద్వాజ్ కి యూత్ లో స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ వుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.  జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు వెండితెర ప్రేక్షకులను సైతం అలరిస్తుంది. యాంకర్ గా క్రేజ్ ఆమెకు బాగా పెరిగిపోవడంతో వెండితెర దర్శక నిర్మాతల చూపు ఆమె పై పడింది. అలా అడివి శేష్ హీరోగా నటించిన క్షణం చిత్రం సినిమాతో పూర్తిస్థాయి వెండితెర నటిగా మారింది అనసూయ. ఆ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర కు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు రాగా అవకాశాలు కూడా భారీగానే వచ్చాయి అనసూయకు. 

ఆమె వెండితెర కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా రంగస్థలం సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. ఈ పాత్రలో తాను తప్ప ఇంకెవరు నటించ లేరు అన్న రేంజ్ లో ఈమె నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపిన అనసూయ ఒకసారిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో అద్భుతంగా నటించే సరికి ప్రేక్షకులు సైతం ఆమెలో ఇంత టాలెంట్ దాగి ఉందా అని ఆశ్చర్యపోయారు.  నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగులు కూడా చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయ ఏ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే సంఘటనలకు ముఖ్యంగా ఆడవారిపై జరిగే కొన్ని ఘటనలకు రెస్పాన్స్ ఇచ్చి తనదైన శైలిలో మండి పడుతూ ఉంటుంది. అంతే కాకుండా తన డ్రస్సింగ్ విషయంలో అభిమానులు సలహా ఇస్తే దాన్ని ఖండిస్తుంది. ఒక రకంగా తాను ఏ డ్రెస్సులు వేసుకోవాలో మీరు చెప్పాల్సిన స్థితిలో లేనని ఆమె చెప్పేసింది. ఒక విధంగా ఆమె రోజు నెటిజన్స్ తో పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏదేమైనా సోషల్ మీడియాలో తన అప్డేట్లు ఇస్తూ ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్ లను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది అనసూయ. 

మరింత సమాచారం తెలుసుకోండి: