టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి
హీరో సినిమా ఫంక్షన్ అయినా ఏ
సినిమా ఈవెంట్ అయినా ఆయన గెస్ట్ గా రావడానికి ఏమాత్రం వెనుకాడరు. తన దగ్గర సమయం ఉండి ఎదుటివారి పిలిచే సంస్కారం విషయం తనకు నచ్చితే తప్పకుండా ఆ
సినిమా ఈవెంట్ కి హాజరై ఆ చిత్రానికి ఆల్ ద బెస్ట్ చెపుతారు. అందుకే ఆయన
మెగాస్టార్ గా ఎదగడం జరిగింది అని ఆయన అభిమానులు అలాగే కొంతమంది హీరోలు కూడా చెబుతూ ఉంటారు.
ఇటీవలే అక్కినేని
నాగ చైతన్య హీరోగా నటించిన
లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ కి
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి ఆ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన రావడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా ఈ
వేదిక ద్వారా రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు సినిమాను బ్రతికించండి
సినిమా బ్రతకాలంటే ఇపుడున్న పరిస్థితుల ప్రకారం కొన్ని మార్పులు చేయాల్సిందే అని ఆయన వేడుకున్నారు.
ఇకపోతే తాజాగా మరొకసారి
మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రీ రిలీజ్
ఈవెంట్ లో సందడి చేయనున్నారు. సాయి ధరం తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ కు ఆయన హాజరు కానున్నారని తెలుస్తుంది. ఇటీవలే సాయి ధరంతేజ్ బికే
యాక్సిడెంట్ గురి కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడు కోసం
మెగాస్టార్ చిరంజీవి ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కు హాజరు కాబోతున్నాడట అంతేకాదు పవన్
కళ్యాణ్ కూడా ఈ ఫంక్షన్ కు రానున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు గాని లేదంటే ఇద్దరు కలిసి రావడం జరుగుతుందట.
అక్టోబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ
సినిమా ఫంక్షన్ వచ్చే ఆదివారం జరుగనుంది.