విజయ్ దేవరకొండ హీరోగా సెటిల్ అయిన తరువాత వివిధ వ్యాపార రంగాలలో కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే రౌడీ వేర్ అనే పేరుతో టాప్ బ్రాండ్ దుస్తులను ఆన్లైన్లో కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు మరొక వ్యాపారంలోకి ఆయన అడుగు పెడుతున్నాడు. అదే మల్టీప్లెక్స్ వ్యాపారం. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్ వ్యాపారంలో కోట్లు గడిస్తున్నారు హీరో మహేష్ బాబు. ఆయన తర్వాత టాలీవుడ్ లో ఈ వ్యాపారం లోకి దిగాడు విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ ఆ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. దాంతో బాలీవుడ్ లో కూడా ఆయనకు భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న లవ్ స్టోరీ సినిమాను మహబూబ్ నగర్ తాను నిర్మించిన ఏవీడీ సినిమాస్ లో విజయ్ దేవరకొండ ప్రదర్శించనున్నాడు. ఈ మేరకు లవ్ స్టోరీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అధికారిక ప్రకటన చేశాడు. అయితే విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ సినిమాతోనే తన మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని ఎందుకు మొదలు పెట్టానున్నాడు. అనే సందేహం అందరికీ రావచ్చు.

ఏషియన్ వారితో కలిసి విజయ్ దేవరకొండ థియేటర్ నిర్మాణం చేపట్టగా లవ్ స్టోరీ సినిమాను నిర్మించింది కూడా వారే. దాంతో ఆ సంస్థ వారు విజయ్ దేవరకొండ ను తమ సినిమా ఏ వీ డీ థియేటర్లో వేసుకోవాల్సిందని కోరగా విజయ్ దేవరకొండ వారి కోరిక మేరకు లవ్ స్టోరీ సినిమాను తన థియేటర్ లో వేసి మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నాడు. మరి తొలిసారి విజయ్ దేవరకొండ రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో దాని ద్వారా ఈ మల్టీప్లెక్స్ వ్యాపారం కు ఎంతటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఈ థియేటర్లో సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో లైగర్ సినిమా థియేటర్ లో చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

AVD