టాలీవుడ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సినిమాలకు సంబంధించిన విషయమైనా, ఫ్యామిలీ మేటర్ అయినా లేదా సామాజిక అంశాలైనా... ఇలా ఈ విషయమైనా స్పందించడంలో, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో మహేష్ బాబు ముందుంటారు. తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ మన పండగలకు కూడా అందరినీ హృదయపూర్వకంగా విష్ చేస్తూ ఉంటారు. ఇటీవల వినాయక చవితి పండగకు సోషల్ మీడియాలో తన కూతురు సితారతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.

ఇక ఆరేళ్ళ పాప రేప్ విషయం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ విషయంపై ఇండస్ట్రీ నుంచి ముందుగా స్పందించింది మహేష్ బాబు. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తూ మన పాపలు సేఫ్ గానే ఉన్నారా ? అని సూటిగా ప్రశ్నించారు. అందరి గళాన్ని తన ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో విన్పించిన మహేష్ బాబు ఆ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని అధికారులకు రిక్వెస్ట్  చేశారు. అంతేకాదు ఆ పాప తల్లిదండ్రులకు ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు. ఇక ఇలాంటి తప్పులు చేసే వారిని వదిలి పెట్టొద్దు అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆయన ట్వీట్ ను సమర్థిస్తూ అందరూ రీట్వీట్ చేశారు.

 
అంతకు ముందు మహేష్ టోక్యో ఒలంపిక్స్ లో విజయం సాధించిన అథ్లెట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తరువాత పారా ఒలంపిక్స్ లో సత్తా చాటిన అథ్లెట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారానే విష్ చేశారు. "భారతీయ క్రీడలలో ఒక అద్భుతమైన ఫీట్! మీ చారిత్రాత్మక విజయానికి అభినందనలు అవని లేఖర. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళ కావడం గర్వకారణం!  టోక్యో 2020" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఈ విధంగానే క్రీడాకారులతో పాటు సినిమాల్లో కూడా బెస్ట్ పర్ఫార్మర్ లకు తన సపోర్ట్ అందిస్తూ సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: