ఇక ఆరేళ్ళ పాప రేప్ విషయం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ విషయంపై ఇండస్ట్రీ నుంచి ముందుగా స్పందించింది మహేష్ బాబు. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తూ మన పాపలు సేఫ్ గానే ఉన్నారా ? అని సూటిగా ప్రశ్నించారు. అందరి గళాన్ని తన ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో విన్పించిన మహేష్ బాబు ఆ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని అధికారులకు రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు ఆ పాప తల్లిదండ్రులకు ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు. ఇక ఇలాంటి తప్పులు చేసే వారిని వదిలి పెట్టొద్దు అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆయన ట్వీట్ ను సమర్థిస్తూ అందరూ రీట్వీట్ చేశారు.
అంతకు ముందు మహేష్ టోక్యో ఒలంపిక్స్ లో విజయం సాధించిన అథ్లెట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తరువాత పారా ఒలంపిక్స్ లో సత్తా చాటిన అథ్లెట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారానే విష్ చేశారు. "భారతీయ క్రీడలలో ఒక అద్భుతమైన ఫీట్! మీ చారిత్రాత్మక విజయానికి అభినందనలు అవని లేఖర. పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళ కావడం గర్వకారణం! టోక్యో 2020" అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఈ విధంగానే క్రీడాకారులతో పాటు సినిమాల్లో కూడా బెస్ట్ పర్ఫార్మర్ లకు తన సపోర్ట్ అందిస్తూ సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.