తొలుత నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించేవారు. నటన అంటే ఆయనకు ప్రాణం అందుకే పాత్ర ఏదని కాకుండా ఆ పాత్రను ఎంత వరకు పండించగలమా అని ఆలోచించేవారట. అలా ఎన్నో స్టేజ్ లపై నాటకాలతో మెప్పించిన నాగేశ్వర రావును ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడలోని ఓ రైల్వే స్టేషన్లో నాగేశ్వరరావు ను చూసి సినిమాలో నటించే అవకాశమిచ్చారు. అలా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ తార జువ్వ. సుదీర్ఘ కాలం సినీ ప్రయాణం చేశారు. సుమారు 75 సంవత్సరాలు వరకు ఆయన సినీ పరిశ్రమలో రాణించారు. ఆనాటి ఇండస్ట్రీని ఏలిన రారాజులుగా అన్న ఎన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వాళ్ళే మొదట గుర్తొస్తారు. పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అరుదైన, ఎంతో విశిష్టమైన పురస్కారాలను అందుకున్నారు.
తన నటనతో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసారు. తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో 256 సినిమాలకు పైగా నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం “మనం”. ఇందులో తన కుటుంబ నట వారసులైన నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ లతో కలిసి నటించారు. ఈ రోజు నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను గుర్తు తెచుకున్నాము.