కుర్ర హీరోలతో సీనియర్ హీరోలు పోటీపడలేరనీ.. యంగ్ స్టర్స్ స్పీడ్ ను అందుకోలేరని చాలామంది అనుకుంటారు. కానీ టాలీవుడ్‌లో సీనియర్ హీరోలే కుర్ర హీరోల కంటే కంటే స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆరు పదులు దాటినా కూడా తమలో జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే యంగ్ స్టర్స్ కు సవాల్ విసురుతున్నారు.

చిరంజీవి 'ఖైదీ నం.150'తో రీఎంట్రీ ఇచ్చాక బాస్‌ ఈజ్ బ్యాక్ అని అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఈ జోష్‌ని మరింత పెంచడానికి బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్‌తో సందడి చేస్తున్నాడు చిరు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే రెండు మూడు సినిమాలకి సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఆచార్య'తో బిజీగా ఉన్న చిరు మరో మూడు సినిమాలని లైన్‌లో పెట్టాడు. చిరంజీవి నెక్ట్స్‌ మోహన్‌రాజా దర్శకత్వంలో 'గాడ్‌ఫాదర్' చేస్తున్నాడు. ఈ మూవీ మళయాళీ హిట్‌ 'లూసిఫర్' రీమేక్‌గా వస్తోంది. అలాగే మెహర్ రమేశ్‌తో 'బోళా శంకర్' సినిమా అనౌన్స్‌ చేశాడు. తమిళ్‌ హిట్ 'వేదళం' రీమేక్‌గా వస్తోందీ సినిమా. వీటితోపాటు బాబీ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు చిరు.

బాలకృష్ణ కూడా బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. 'అఖండ' సినిమా సెట్స్‌లో ఉండగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌తో 'అఖండ' షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. దీంతో గోపీచంద్ మలినేని సినిమా కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతోంది. వెంకటేశ్ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. అయితే ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో హంగామా చేస్తున్నాడు. ఇప్పటికే 'నారప్ప'  సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశాడు. అలాగే 'దృశ్యం2' షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందా, థియేటర్లలోకి వస్తుందా అనేది క్వశ్చన్‌మార్క్‌గా కనిపిస్తోంది.  

వెంకటేశ్, వరుణ్‌ తేజ్ హీరోలుగా నటించిన ఫన్‌ ఎంటర్‌టైనర్ 'ఎఫ్2'. ఇప్పుడీ మూవీకి సీక్వెల్‌గా 'ఎఫ్3' అనే సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. అలాగే 'సోగ్గాడే చిన్నినాయనా' ప్రీక్వెల్‌ కూడా మొదలుపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: