ఈడి కార్యాలయం లో కాసేపటి క్రితం తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను విచారించిన అధికారులు... బ్యాంక్ ఖాతాల గురించి ప్రస్తావించారు. ఈరోజు తో సినీతారల విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. తన బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో హాజరు అయిన 12 మంది సినీ సెలబ్రిటీలు... పలు కీలక విషయాలను చెప్పినట్టుగా తెలుస్తుంది. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడి విచారణ... తరుణ్ తో ముగిసింది. ఆగస్ట్ 31 న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించిన ఈడి... సెప్టెంబర్ 2 న ఛార్మి నీ 8 గంటల పాటు విచారించింది.

సెప్టెంబర్ 6 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 3 నే హాజరు రకుల్  ప్రీత్ సింగ్ విచారణకు వచ్చింది. సెప్టెంబర్ 3 న రకుల్  ను  6 గంటల పాటు విచారించిన ఈడి... ఆ తర్వాత నందు ని విచారించింది. సెప్టెంబర్ 20 న  హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 7 న నందు  విచారణకు హాజరు అయ్యాడు. సెప్టెంబర్  7 న ఈడి కార్యాలయానికి కెల్విన్, జీషాన్ వచ్చారు. కెల్విన్ , జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసి ఈడి కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8 న రానా ను 8 గంటల పాటు విచారించింది.

రానా, నందు విచారణ కు  హాజరు అయ్యిన రోజుల్లో కెల్విన్ , జీశాన్ లను కలిపి ఈడి అధికారులు విచారించారు. సెప్టెంబర్ 9 న రవితేజ , తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించిన ఈడి... సెప్టెంబర్ 13 న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించింది. సెప్టెంబర్ 15 న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించింది. సెప్టెంబర్ 17 న తనీష్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 22 న తరుణ్ ను 8 గంటల పాటు విచారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: