సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఇప్పుడు తన తదుపరి చిత్రాలను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతు ఉండడంతో ఆయన తన తదుపరి చిత్రాల పై ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను నవంబర్ లో పట్టాలెక్కించాలని భావించగా ఆ తరువాత ఆయన చేయబోయే చిత్రాలను చేసుకునే విధంగా ఇప్పటి నుంచి ఆలోచనలు మొదలుపెట్టాడు.

అనిల్ రావిపూడి మరియు కొంతమంది దర్శకులు కథలు ఈయన వింటున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారికి టైం ఇచ్చి కలుస్తున్నారు. అంతే కాకుండా మొత్తంగా ఆరుగురు దర్శకులతో ఆయన మీటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది.ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తో కలిసి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా మహేష్ బాబు క్యాజువల్ గా మాట్లాడారట. మరి వారితో సినిమాలు చేయడానికా లేదా వేరే విషయాల గురించి కలిశాడా అనేది ఇంకా తెలియల్సి ఉంది. అంతే కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో కూడా ఓ సబ్జెక్ట్ డిస్కస్ చేశారంటున్నారు. చాలా కాలంగా వీరి కాంబినేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. 

ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి తో చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. జేమ్స్ బాండ్ లాంటి పవర్ ఫుల్ కథను రాజమౌళి మహేష్ బాబు కోసం సిద్ధం చేశాడని తెలుస్తుంది.  దీని కోసం ఓ ఇంగ్లీషు నవల హక్కులను కూడా ఆయన కొన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా కోసం రాజమౌళి ఇంకా కథ ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరగగా అవేవీ మహేష్ కు నచ్చలేదు. మరో కథ చేయడానికి సిద్ధమవుతున్నాడు జక్కన్న. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కోసం గట్టిగానే వర్క్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: