నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా, అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించి ప్రోమో లను కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా మూవీ పై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ,  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని అదిరిపోయే కథను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ను పోలీస్ ఆఫీసర్ గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్ లో గోపీచంద్ మలినేని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు గెటప్ ల విషయంలో గోపీచంద్ మలినేని ఒక ఐడియా కూడా వచ్చినట్లు తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెప్పించేలా నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం పవర్ ఫుల్ డైలాగులు కూడా గోపీచంద్ మలినేని రాసుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం షూటింగ్ రాయలసీమ, కర్ణాటక బార్డర్ ప్రాంతంలో చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ టైటిల్ విషయంలో చిత్రబృందం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: