అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఇప్పటికే నాగచైతన్య సాయి పల్లవి హీరోయిన్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమాను పూర్తి చేసి  విడుదలకు సిద్ధం చేశాడు. సెప్టెంబర్ 24 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో పలు టీవీ చానళ్ల ఇంటర్వ్యూలో పాల్గొంటున్న నాగచైతన్య అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఈ మధ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. నాగచైతన్య 'ఓటిటి' లో నటించడానికి రెడీ అయ్యాడని, ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు అని ఎప్పటినుండో అనేక వార్తలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి తెలియజేశాడు. నాగ చైతన్య 'ఓటిటి' ల గురించి మాట్లాడుతూ.. అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలియజేశాడు.

 అలాగే ఈ వెబ్ సిరీస్ లో తాను నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లు కూడా తెలిపాడు. ఈ వెబ్ సిరీస్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్లు నాగచైతన్య తెలియజేశాడు. నాగచైతన్య విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఇది వరకే 'మనం' సినిమా రాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ నిలిచింది. ప్రస్తుతం కూడా వీరిద్దరి కాంబినేషన్ లో 'థాంక్యూ' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగా నచ్చడంతో నెగిటివ్ రోల్ లో కనిపించడానికి నాగచైతన్య ఓకే చెప్పినట్లు తెలిపాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సినిమా చేద్దామని నిర్మాతలను అడగలేను అని, వెబ్ సిరీస్ ద్వారా 'ఓటిటి' ఆ అవకాశాన్ని కల్పిస్తోంది అని అన్నారు. బిగ్ స్క్రీన్ మీద తమకున్న రిస్ట్రీషన్స్ వల్ల అందరు నటీనటులు అన్ని పాత్రలను చేయలేకపోతున్నారు అని 'ఓటిటి' ల వల్ల అవకాశం దక్కుతుందని నాగచైతన్య తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: