సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల అవుతుండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయిపల్లవి ఎంతో హుషారుగా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే ఓ అగ్ర మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను చెప్పగా లవ్ స్టోరీ చిత్రం ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో డ్యాన్స్ ఒకటే ప్రధాన భాగం కాదని ఇది కేవలం దాని చుట్టూ తిరిగే కథ మాత్రమేనని ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఈ సినిమాను ప్రతి ఒక అమ్మాయి చూడాలని చెప్పారు. అమ్మాయిలకు లక్ష్యం ఏర్పడితే ఏ విధంగా వారు ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు అనే ఓ అమ్మాయి కథే ఈ సినిమా అని చెప్పారు. కళకు లింగభేదం అనేది లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకే రకంగా కృషి చేస్తారు. ఎవరు బాగా కృషి చేస్తే వారే జీవితంలో సక్సెస్ అవుతారు. లవ్ స్టోరీ లో టెక్నీషియన్స్ ఎక్కువగా అమ్మాయిలు ఉండడం వల్ల నా పనితీరులో మార్పు కనిపించింది అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రాల గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా తో పాటు విరాటపర్వం సినిమాలో కూడా తాను నటించానని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పింది. అలాగే భవిష్యత్తులో ఓ టీ టీ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాను అని చెప్పింది. ఇప్పటికే కాన్సెప్ట్ విన్నాను చాలా బాగా నచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అని చెప్పింది. తమిళ మలయాళ భాషల్లో ఓ సినిమా చేయాల్సి ఉందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఏదేమైనా సాయిపల్లవి కెరీర్ బిజీగా మారుతూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: