ఇటీవలే
బైక్ యాక్సిడెంట్ కి గురై సాయి ధరంతేజ్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆయన నటించిన రిపబ్లిక్
సినిమా అక్టోబర్ 1న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది.
కరోనా మొదటి దశ తరువాత
సోలో బ్రతుకే సో బెటర్ అంటూ పలకరించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఈ మెగా మేనల్లుడు ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం విశేషం. సోలో బ్రతుకే సో బెటర్
సినిమా బాక్సాఫీసు వద్ద పరిస్థితులు కలిసి రావడం తో ఈ
సినిమా హిట్ తన ఖాతా లోకి వచ్చినట్లు అయింది
ప్రస్థానం మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ
సినిమా కూడా ప్రస్థానం తరహాలోనే రాజకీయ సామాజిక అంశాలతో కూడిన కథ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ
సినిమా ట్రైలర్ లాంచ్ చేయగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతాయి అని భావించిన చిత్ర యూనిట్ కి కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే కొంతమంది కి ట్రైలర్ ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యం గా
సాయి ధరమ్ తేజ్ ఇంత గొప్ప వ్యక్తిగా చూడడం కష్టమని అంటున్నారు.
ఆయనను
లవర్ బాయ్ గా చూస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. దేవకట్టా
సినిమా లు బాగానే ఉన్నా దానికి తగ్గట్లుగా
హీరో నీ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెబుతున్నారు.
సినిమా సీరియస్ గా ఉన్నప్పటికీ
మాస్ కమర్షియల్ అంశాలు ఉంటే ఆ
సినిమా సూపర్ హిట్ అవుతుంది కానీ ఈ సినిమాలో అవేవీ లేనట్లుగా తెలుస్తుంది. దీంతో రిపబ్లిక్ ప్రేక్షకుల అంచనాలను దాటి వారిని మెప్పించి బాక్సాఫీస్ విజేతగా నిలిచి సాయిధరమ్ తేజ్ కు హిట్ ను తీసుకు వస్తుందో చూడాలి. ఇకపోతే సాయిధరమ్
సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలు ఒకే చేసిన విషయం తెలిసిందే.