శేఖర్ కమ్ముల నుండి సినిమా వస్తుంది అంటే అది తప్పకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. ఆ విధంగా మొదటి నుండి క్లాస్ తో పాటు హృద్యమైన సినిమాలు తీసి అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం తీసిన సినిమా లవ్ స్టోరీ. ఫస్ట్ టైం నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందించగా ఎమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ అలానే శేఖర్ కమ్ముల కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించడం జరిగింది.

ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్నిటికీ కూడా ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు అవి సినిమాపై అందరిలో భారీ గా అంచనాలు కూడా ఏర్పరిచిన విషయం తెలిసిందే. ఇక మొన్న జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ యూనిట్ కి ప్రత్యేకంగా ముందస్తు అభినందనలు తెలియచేసారు. అయితే ఈ సినిమా కథ ప్రకారం అందరూ యువతీ యువకుల జీవితాల్లో జరిగే మాములు లవ్ స్టోరీ మాదిరిగానే సాగుతుందని, కాగా మూవీలో రెండు ముఖ్యమైన అంశాలను పొందుపరిచాం అని, నేటి సమాజానికి సంబందించిన ఆ అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు వారి మనసుని తాకుతాయని నిన్న పలు ఇంటర్వ్యూల్లో భాగంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ చెప్పారు.

సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ కూడా ఎంతో నాచురల్ గా యాక్ట్ చేసారని, తాను కూడా ఎంతో అలోచించి జాగ్రత్తగా సినిమా తీశానని, అలానే యూనిట్ మొత్తానికి సినిమా సక్సెస్ పై మంచి నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇటీవల సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై మంచి ప్రశంసలు కురిపించడంతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మూవీపై మంచి పాజిటివ్ బజ్ ఉండడంతో ఈ లవ్ స్టోరీ మూవీ తప్పకుండా విడుదల తరువాత మంచి సక్సెస్ కొట్టే అవకాశం బాగానే కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: