టాలీవుడ్
సినిమా పరిశ్రమలో పవన్
కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ పాపులారిటీ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన
సినిమా కోసం కోట్లాది మంది ప్రేక్షకులు మొదటిరోజు థియేటర్లలో సందడి చేస్తూ ఆయన స్టామినా ను తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాలతో పవన్ నటించిన
సినిమా అజ్ఞాతవాసి వచ్చింది. అయితే ఈ
సినిమా ప్రేక్షకుల అంచనాలను మాత్రం ఏ మాత్రం అందుకోలేకపోయింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్
కళ్యాణ్ నటించిన మూడవ చిత్రం కావడం హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి ఓ మంచి కథను ఎంచుకున్నారు.
అయితే ఈ
సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన
జల్సా మరియు
అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ గా ఈ చిత్రం కూడా వాటిలాగే
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అనుకున్నారు. కానీ ఈ
సినిమా నీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. అంతేకాదు కథ విషయంలో జాగ్రత్త లేకపోవడం తో ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. పవన్
కళ్యాణ్ ను ఆ పాత్రలో అసలు చూడలేక పోయారు.
తండ్రిని చంపిన నేరగాళ్ల ను పట్టుకోవడం కోసం
తన సొంత కంపెనీ కి నార్మల్ ఉద్యోగి గా వెళ్లి అక్కడ వీక్ పాయింట్స్ ను, లొసుగులను, మనుషులని గమనించి తన
తండ్రి నీ ఎవరు చంపారు అనేది
హీరో కని పెట్టడమే ఈ
సినిమా కథ . తొలిసారి
కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా
ఆడియో పరంగా ఈ
సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం మాత్రం భారీ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు
త్రివిక్రమ్ పవన్
కళ్యాణ్ కు పెద్ద చెడ్డపేరు తీసుకువచ్చింది. హీరోయిన్స్ గా
కీర్తి సురేష్ మరియు అను ఇమ్యన్యుయెల్ నటించగా ఈ
సినిమా వారికి కూడా పెద్దగా ఉపయోగపడలేదు.