నాచురల్ స్టార్ నాని హీరోగా, కృతి శెట్టి ,సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా లేడి లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.ఈ సినిమాకి రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో విడుదల చేసి కొంతవరకు నష్టాలను చవిచూసిన నిర్మాతలు , ఎలాగైనా సరే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక అందుకే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను కూడా భారీ ధరకే అమ్మినట్లు తెలుస్తోంది..

తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆన్లైన్  సంస్థ నెట్ ఫ్లెక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాను మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాత ని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. జంగా సత్యదేవ్ కథ అందించారు. ఇకపోతే ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకుంటుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన నాని వి సినిమాతో ఓ టీ టీ లో రాగా.. ఇప్పుడు సెప్టెంబర్ 10 తేదీన టాక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది.. రీతువర్మ, నాని కలిసి నటించిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.. ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలా లేక థియేటర్లో విడుదల చేయాలా అన్న నేపథ్యంలో ఇటు నిర్మాతలకు , దర్శకులకు , నానికి కూడా మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే.. మొత్తానికి కలెక్షన్లు లేక నష్టాన్ని చూసిన ఈ సినిమాను దృష్టిలో పెట్టుకొని శ్యామ్ సింగరాయ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు సిద్ధమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: