తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆన్లైన్ సంస్థ నెట్ ఫ్లెక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాను మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాత ని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.. జంగా సత్యదేవ్ కథ అందించారు. ఇకపోతే ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకుంటుందని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన నాని వి సినిమాతో ఓ టీ టీ లో రాగా.. ఇప్పుడు సెప్టెంబర్ 10 తేదీన టాక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది.. రీతువర్మ, నాని కలిసి నటించిన ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.. ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలా లేక థియేటర్లో విడుదల చేయాలా అన్న నేపథ్యంలో ఇటు నిర్మాతలకు , దర్శకులకు , నానికి కూడా మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే.. మొత్తానికి కలెక్షన్లు లేక నష్టాన్ని చూసిన ఈ సినిమాను దృష్టిలో పెట్టుకొని శ్యామ్ సింగరాయ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు సిద్ధమయ్యారు.