మహేష్ బాబు కెరీర్ లో చేసిన ఒకే ఒక పెద్ద తప్పు బ్రహ్మోత్సవం
సినిమా చేయడం అని ఆయన అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. అనవసరంగా ఆ
సినిమా చేసి ఆయన బ్యాడ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు అని కూడా అంటారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సినిమా చేసిన తర్వాత అలాంటి ఫ్యామిలీ
సినిమా ఒకటి చేయాలని మహేష్ భావించగా బ్రహ్మోత్సవం
సినిమా చేశాడు. అయితే ఆ
సినిమా విడుదలైన మొదటి షో తోనే దాని ఫలితం ఏమిటో తెలిసిపోయింది.
ప్రేక్షకులను భారీ గా నిరాశ పరిచిన చిత్రం గా నిలిచిపోయింది. మహేష్ బాబు కెరీర్లో ఇంత దారుణమైన
సినిమా మరొకటి లేదని చెప్పవచ్చు.
కాజల్ మరియు
సమంత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అసలు కథ లేదని స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగా ఉంది అని అసలు ఏం చూసి మహేష్ బాబు ఈ
సినిమా ఒప్పుకున్నాడో తెలియడం లేదని వారు చెప్పారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చగా పాటలు కొంత వరకు ఆకట్టుకున్న కూడా
సినిమా మాత్రం దారుణంగా పోయింది.
ఫలితంగా భారీ తారాగణం నటించిన ఈ
సినిమా ఫలితం ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడే లేకపోయింది. నిర్మాతకు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
స్పైడర్ సినిమా తో ప్రేక్షకులను నిరాశ పరిచిన మహేష్ బాబు మరొకసారి ఈ సినిమాతో ఫ్లాప్ అందుకొగా మరో హిట్ కోసం ఎదురు చూడగా ఆ తరువాత భరత్ అనే నేను
సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ బ్రహ్మోత్సవం దెబ్బతో
శ్రీకాంత్ అడ్డాల కూడా తన తదుపరి
సినిమా చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన ఇటీవలే
నారప్ప అనే
రీమేక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి మరో
సినిమా చేస్తారో లేదో చూడాలి.