టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
బాలకృష్ణ తో ఒకసారి పని చేస్తే మళ్ళీ మళ్ళీ పని చేయాలని అనుకుంటారు మన దర్శకులు. ఈ విషయాన్ని కొంతమంది దర్శకులు బహిరంగంగా కూడా చెప్పారు. వారిలో
పూరి జగన్నాథ్ కూడా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో
పైసా వసూల్ అనే
సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను భారీ గా నిరాశ పరిచింది. అయితే ఆ చిత్రం ఫలితం పట్టించుకోని వీరిద్దరూ మరొక
సినిమా చేయాలని సూపర్ హిట్ కొట్టాలని భావించగా వీరిద్దరి కాంబినేషన్ లోని
సినిమా కొరకు అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్
సినిమా షూటింగ్ లో
బాలకృష్ణ సందడి చేశాడు.
విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. అయితే
బాలకృష్ణ అనుకోకుండా ఆ సెట్స్ కి వెళ్లి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అనుకోని అతిథి గా వచ్చిన బాలకృష్ణను ఎంతో బాగా రిసీవ్ చేసుకుని చిత్రబృందం ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంది. అంతే కాదు
పూరి జగన్నాథ్ కూడా మీ కోసం ఒక మంచి కథ తయారు చేశారని చెప్పారట. త్వరలోనే వీరిద్దరూ కలిసి కథ పై ఓ సిట్టింగ్ కూడా వేయబోతున్నారట.